ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని 20 ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఐఐఎం బిల్లు 2017ను జూలై నెలలో లోకసభ ఆమోదించింది.
దీంతో డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం ఐఐఎంలకు లభించనుంది. సంచాలకులు, సిబ్బంది నియామకంతో పాటు నిర్వహణకు సంబంధించి అన్ని అధికారాలు ఐఐఎంలకే దక్కనున్నాయి.

ప్రతి ఐఐఎంకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్.. ఎగ్జిక్యూటివ్ బాడీగా వ్యవహరిస్తారు. 19 సభ్యుల్లో 17 మందిని అధ్యాపకులు, పూర్వ విద్యార్థులతో పాటు ప్రముఖ వ్యక్తుల నుంచి సభ్యులుగా ఎంపిక చేసుకునే వీలు ఉంది. మరో ఇద్దరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి.












Click it and Unblock the Notifications