పెళ్లైన జంట ఎంత మంది పిల్లల్ని కనాలో ప్రభుత్వమే నిర్ణయించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్స్
అధిక జనాభా కారణంగానే మనదేశం అనుకున్న స్థాయిలో అభివృద్ది చెందడంలేదని, మతాలకు అతీతంగా పెళ్లైన జంటలు ఎంత మంది పిల్లల్ని కనాలనేదానిపై ప్రభుత్వమే చట్టాన్ని రూపొందించాల్సిన టైమ్ ఆసన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. 'ఇద్దరు పిల్లల' చట్టాన్ని రూపొందించేలా ప్రధాని మోదీని కోరతానని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని మోరదాబాద్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో అభివృద్ధి సవ్యంగా జరగాలంటే 'ఇద్దరు పిల్లల' చట్టం అవసరమని, అది అన్ని మతాలకు సమానంగా వర్తించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేకాబట్టి, చట్టం రూపొందించాల్సిందిగా ప్రధాని మోదీని, ఇతర పెద్దలను అభ్యర్థిస్తామని తెలిపారు.

దేశ భద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించి ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ బాసటగా ఉంటుందని, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అదే తీరును అవలంభిస్తామని భగవత్ అన్నారు. అయోధ్యలో రామ మందిరానికి మార్గం సుగగమమైన నేపథ్యంలో తదుపరి కాశీ, మథుర ఆలయాల పునరుద్ధరణకు సంఘ్ సంస్థలు ఉద్యమిస్తాయంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అయోధ్య ఆలయంపై కమిటీ ఏర్పాటైన వెంటనే ఆ అంశాన్ని వదిలేస్తామని భగవత్ క్లారిటీ ఇచ్చారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications