మా దేశానికి రండి: ప్రధాని మోడీకి రష్యా, ఉక్రెయిన్ దేశాధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ ఆహ్వానం
న్యూఢిల్లీ: భారతదేశంలో జరగనున్న లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. కాగా, బుధవారం పుతిన్, జెలెన్ స్కీతో ప్రధాని మోడీ ఫోన్లో వేర్వేరుగా మాట్లాడారు. ఆ సమయంలో ఇరువురు అధ్యక్షులు మోడీని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్కు విషెస్ చెప్పారు మోడీ. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని స్పష్టం చేశారు.

భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు అంగీకరించామని మోడీ తెలిపారు. ఉక్రెయిన్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా సుదీర్ఘంగా పుతిన్, మోడీ చర్చించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇదే అంశంపై అటు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కూడా స్పందించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొంటూ.. మోడీకి శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించింది.
Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia
— Narendra Modi (@narendramodi) March 20, 2024
అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఫోన్ మాట్లాడారు ప్రధాని మోడీ. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కోసం భారత్ అన్నివిధాలా కృషి చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. ఇదే సమయంలో మనవతా సహాయాన్ని భారత్ కొనసాగిస్తుందన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సంభాషించిన మోడీ.. సంప్రదింపులు, దౌత్యమార్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ చెప్పినట్లు పేర్కొన్నారు.
Had a good conversation with President @ZelenskyyUa on strengthening the India-Ukraine partnership. Conveyed India’s consistent support for all efforts for peace and bringing an early end to the ongoing conflict. India will continue to provide humanitarian assistance guided by…
— Narendra Modi (@narendramodi) March 20, 2024
మరోవైపు, ఉక్రెయిన్కు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోడీని ఉక్రెయిన్ ఆహ్వానించారు జెలెన్స్కీ. కాగా, ఇలా ఒకేరోజు రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మోడీ సంభాషించడం విశేషం. ఇది ఇలావుండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ.. భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications