Wife: అందమైన భార్య మీద డౌట్, తాగుబోతు భర్త, రాత్రి పంచాయితీ, సెల్ఫీ వీడియో తీసి !
బెంగళూరు/చిత్రదుర్గ: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అందంగా ఉన్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. పీకలదాక మద్యం సేవిస్తున్న భర్త రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త మద్యం మత్తులో అతని భార్యను చితకబాదేసి వీధిలో పంచాయితీ పెట్టాడు. భర్త తీరుతో విసిగిపోయిన భార్య సెల్ఫీ వీడియో తీసి ఇద్దరు బిడ్డలతో కలసి డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

దంపతులు హ్యాపీ
కర్ణాటకలోకి చిత్రదుర్గా జిల్లాలోని జానకల్ లంబాణిపట్టిలోని మంజు నాయక్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన అర్పితా (27) అనే యువతిని మంజు నాయక్ వివాహం చేసుకున్నాడు. మంజు నాయక్, అర్పితా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భార్య మీద డౌట్ వచ్చేసింది
మంజు నాయక్, అర్పితా దంపతులకు మానస (6) అనే కూతురు, మదన్ (4) అనే కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన ఆరు సంవత్సరాల తరువాత అందంగా ఉన్న భార్య అర్పితా మీద మంజు నాయక్ కు అనుమానం మొదలైయ్యింది. తన భార్య అర్పితా వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తోందని మంజు నాయక్ విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు.

పీకలదాక తాగేసి బెండ్ తీస్తున్నాడు
పీకలదాక మద్యం సేవిస్తున్న మంజు నాయక్ ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్లి తరువాత అతని భార్య అర్పితాను పట్టుకుని చితకబాదుతున్నాడు. అర్పితా ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో మంజు నాయక్ ఇంకా రగిలిపోయాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా మంజు నాయక్ అతని పద్దతి మార్చుకోలేదని సమాచారం.

రాత్రి పంచాయితీ పెట్టిన తాగుబోతు మొగుడు
అర్పితా, మంజు నాయక్ దంపతుల మద్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన మంజు నాయక్ మద్యం మత్తులో అతని భార్య అర్పితాను చితకబాదేసి పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. మంజు నాయక్ తీరుతో విసిగిపోయిన అతని భార్య అర్పితా ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య
సెల్ఫీ వీడియో తీసిన అర్పితా ఆమె ఇద్దరు బిడ్డలు మానస, మదన్ లను చెక్ డ్యామ్ లో తోసేసి తరువాత ఆమె కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఒకే కుటుంబంలో తల్లీ, పిల్లలో ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. పోలీసులు మంజు నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications