చెన్నై సిల్క్ భవన్లో 400కిలోల బంగారం స్వాధీనం
చెన్నై: నగరంలోని అగ్నిప్రమాదానికి గురైన చెన్నై సిల్క్ భవన శిథిలాల్లో రెండు భారీ లాకర్లను వెలికితీశారు. ఈ లాకర్లలో 400 కిలోల బంగారు, 2 వేల కిలోల వెండి ఆభరణాలున్నట్లు సమాచారం. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టీనగర్లోని చెన్నై సిల్క్ భవనంలో మే 31న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఆ భవనం మొత్తం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ భవంతిలో 'శ్రీకుమరన్ తంగమాళిగై' నగల దుకాణం ఉండగా దీనికి సంబంధించిన భారీ లాకర్లను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.

ఆ భవనం కూల్చివేత పనులు 20 రోజులపాటు సాగగా... మంగళవారం పూర్తిగా నేలమట్టమయింది. ప్రస్తుతం ఆ శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం రెండు లాకర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం వీటిని భద్రపరిచారు.












Click it and Unblock the Notifications