సెల్యూట్ అంబులెన్స్ డ్రైవర్: తల్లి చనిపోయిందని తెలిసినా.. డ్యూటీ చేసి...
అసలే కరోనా కాలం.. అంతా స్వార్థమే. పక్కవారి గురించి పట్టించుకోవడం లేదు. ఇక మంచి చెడుల సంగతి దేవుడెరుగు. ఇక ప్రంట్ లైన్ వారియర్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే అంబులెన్స్ డ్రైవర్లు/ వైద్యారోగ్య సిబ్బంది పాత్ర కీలకం. ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో ఓ అంబులెన్స్ డ్రైవర్ తన విధుల పట్ల చూపిన అంకిత భావానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
తల్లి మరణవార్త తెలిసినా డ్యూటీ పూర్తి చేశాకే ఇంటికి వెళ్లాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. బాధను దిగమింగుకుని 15 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రికి చేర్చాడు ఆయన. ఆగ్రాకు చెందిన ప్రభాత్ యాదవ్ గత తొమ్మిదేళ్లుగా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన నైట్ డ్యూటీలో ఉండగా తల్లి చనిపోయినట్టు అతనికి సమాచారం వచ్చింది. అప్పటికి అతను తన డ్యూటీ షిఫ్ట్ మధ్యలో ఉన్నాడు. కోవిడ్ రోగుల నుంచి వరుస ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వెళ్లడం మంచిది కాదనుకొని.. డ్యూటీ పూర్తి చేశారు.

అలా ఆ రాత్రంతా డ్యూటీ చేసి 15 మంది పేషెంట్స్ను హాస్పిటల్కు చేర్చాడు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి బయల్దేరాడు. తన గ్రామానికి వెళ్లి తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి 24 గంటల్లో వెనక్కి తిరిగి వెళ్లి విధుల్లో జాయిన్ అయిపోయాడు. ఇంటికి వెళ్లడమే కాదు.. మళ్లీ తిరిగి విధుల్లో చేరాడు ఆయన. ఆయన అంకితభావం మిగతావారికి ఆదర్శంగా నిలిచారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications