కుట్ర, వెన్నుపోటు, చీకటి నుంచి బయటకు వస్తా: ఇదీ శశికళ శపథం
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ లొంగిపోవడానికి ముందు దివంగత జయలలిత సమాధి వద్ద రౌద్రరూపంతో శపథం చేశారు. మూడుసార్లు సమాధి వద్ద కొట్టి ప్రతిజ్ఞ చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ లొంగిపోవడానికి ముందు దివంగత జయలలిత సమాధి వద్ద రౌద్రరూపంతో శపథం చేశారు. మూడుసార్లు సమాధి వద్ద కొట్టి ప్రతిజ్ఞ చేశారు.
ఆమె ఏం ప్రతిజ్ఞ చేశారనే విషయమై ఇప్పటికే అన్నాడీఎంకే క్యాడర్ వెల్లడించారు. అయితే, తాజాగా, ఆ పార్టీ అధికారిక ట్విట్టర్లో అమ్మ చేసిన ప్రతిజ్ఞను ట్వీట్ చేశారు.

'కుట్ర, వెన్నుపోటు, చీకటి నుంచి విజయవంతంగా బయటకు వస్తా' అని శశికళ మూడుసార్లు జయలలిత సమాధి వద్ద శపథం చేశారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట శశికళ లొంగిపోయారు. తనను ప్రత్యేక ఖైదీగా చూడాలన్న పిటిషన్ను న్యాయవాది తిరస్కరించారు. అనంతరం న్యాయమూర్తి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. శశికళకు ఖైదీ నెంబర్ 10711, ఇళవరసి నెంబర్ 10712 కేటాయించారు.












Click it and Unblock the Notifications