మహా డ్రామాపై సుప్రీంకోర్టు ట్విస్ట్ -మంత్రిపై ఆరోపణలు తీవ్రమైనవే, కానీ పరంబీర్ పిటిషన్ విచారణకు నో
ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంబానీ 'బాంబు' కేసు, హిరేన్ హత్య కేసు, ఆ రెండిటిలో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే వ్యవహారం, హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెబితేనే వాజే అక్రమాలకు పాల్పడ్డాడని ముంబై మాజీ సీపీ పరంబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దరిమిలా మహారాష్ట్రలో గడిచిన మూడు వారాలుగా హైడ్రామా కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు పెట్టిన మాజీ పోలీస్ సచిన్ వాజేను వాడుకుంటూ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ భారీ వసూళ్లకు పాల్పడ్డారని, పోలీసుల బదిలీలోనూ అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరంబీర్ సింగ్ పిటిషన్ ను పరిశీలించి, దానిని విచారించలేమని స్పష్టం చేసింది. సుప్రీం వద్దకు రావడానికి ముందుగా పిటిషనర్ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో పరంబీర్ సింగ్ తన పిటిషన్ ను వెనక్కి తీసుకుని, బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే,
పిటిషన్ ను విచారణకు స్వీకరించాలా, వద్దా అనే అంశంపై వాదనలు విన్న సుప్రీం బెంచ్.. సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు తీవ్రమైనవేనని. పోలీస్ శాఖలో సంస్కరణు గతి తప్పినట్లుగా కనిపిస్తున్నదని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సుప్రీం జడ్జిలు అన్నారు.
ముంబై నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి తనను బదిలీ చేయడం చట్టవిరుద్ధమని, నిరంకుశత్వమని పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని, అదే సమయంలో మహారాష్ట్ర హోం మంత్రిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అంబానీ బాంబు కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ వాజే ద్వారా నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేసేందుకు మంత్రి దేశ్ముఖ్ ఆదేశాలిచ్చారని పంరబీర్ ఆరోపించారు. దేశ్ ముఖ్ ఎన్సీపీ నేత కావడంతో మమారాష్ట్ర కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. పరంబీర్ వెనుక బీజేపీ హస్తం ఉందని ఎన్సీపీ ఆరోపిస్తోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications