యూపీలో ముస్లిం విద్యార్దికి చెంపదెబ్బలు-విచారణకు సుప్రీం ఆదేశం-తీవ్ర వ్యాఖ్యలు..
యూపీలోని ముజఫర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ముస్లిం విద్యార్దిని తోటి విద్యార్ధులతో టీచర్ చెంపదెబ్బలు కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ మనస్సాక్షిని కదిలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ విద్యార్ధిని స్కూల్లో అతని మతం ఆధారంగా చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేస్తుంటే అసలు విద్యాహక్కు చట్టం అమలవుతుందా అని యోగీ సర్కార్ ను ప్రశ్నించింది.
ముజఫర్నగర్లోని పాఠశాలలో ఉపాధ్యాయురాలు తన సహవిద్యార్థిని చెప్పుతో కొట్టమని ఆదేశించిన ఘటన ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని, ఈ ఘటనకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయుని సూచనల మేరకు ఏడుస్తున్న ముస్లిం విద్యార్థిని వంతులవారీగా కొట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

గత నెలలో బయటపడిన ఈ వీడియో వైరల్ అయింది. ఇందులో టీచర్ తోటి విద్యార్ధులతో ముస్లింవిద్యార్ధిని చెంపదెబ్బలు కొట్టించడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో ప్రభుత్వం టీచర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసును విచారించే విషయంలో తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. టీచర్ ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని,తాము దీనిపై లోతుగా విచారణ చేస్తామని తెలిపింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానం ఇదేనా - ఇదేనా నాణ్యమైన విద్య? ఈ సంఘటనకు రాష్ట్రం బాధ్యత వహించాలని సూచించింది.
ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ మనస్సాక్షిని కదిలించాలని, ఈ ఘటన తర్వాత అయినా ప్రభుత్వం సదరు స్కూల్లో విద్యార్ధులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కౌన్సిలర్ ని నియమించిందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది విద్యార్ధులను శారీరకంగా,మానసికంగా వేధించడం,వారిపై మత, కులపరమైన వివక్షను నిషేధించే విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను పాటించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
బాధిత విద్యార్ధి మానసిక క్షోభను అధిగమించేందుకు నిపుణులైన చైల్డ్ కౌన్సెలర్ను నియమించి కౌన్సెలింగ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. విచారణను పర్యవేక్షించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి మూడు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
-
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications