సెబీ కొరడా: గుజరాత్ సీఎం ప్యామిలీకి రూ. 15 లక్షల జరిమానా
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై సెబీ కొరడా ఝళిపించింది. ఆయన మోసపూరిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్థారించి, రూ.15 లక్షలు జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై సెబీ కొరడా ఝళిపించింది. ఆయన మోసపూరిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్థారించి, రూ.15 లక్షలు జరిమానా విధించింది.
సెబీ 22 సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. వీటిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి చెందిన లిస్టెడ్ కంపెనీ సారంగ్ కెమికల్స్ కూడా ఉంది. ఆయనకు చెందిన హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ సారంగ్ కెమికల్స్ వ్యాపారపరమైన అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారించింది.

2011 జనవరి-జూన్ మధ్య కాలంలో ఈ అక్రమాలు జరిగినట్లు సెబీ వెబ్సైట్లో గత నెల 27న ప్రకటించింది. రూ.15 లక్షల జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఆయన గత ఏడాది ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.
ఎన్నికలు జరిగే సమయంలో విజయ్ రూపానీ కుటుంబంపై ఈ ఆరోపణలు రావడంతో విపక్షాలకు మంచి అవకాశం దొరికినట్టైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications