సెక్షన్ 377పై సుప్రీం కోర్టు తీర్పు: హెచ్ఐవీ కేసు పెరుగుతాయి, దేశానికి చేటు, స్వామి !

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377పై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును వివాదాస్పాద బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తప్పు పట్టారు. స్వలింగ సంపర్కం వలన హెచ్ఐవీ కేసులు ఎక్కువ అవుతాయని, దేశానికి చేటు తగిలి తీరని నష్టం జరుగుతుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

గురువారం సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సుబ్రమణియన్ స్వామి మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు నేడు ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పుకాదని, సుప్రీం కోర్టులోని ఏడుగురు సభ్యుల బెంచ్ ముందు మళ్లీ విచారణ చెయ్యడానికి అవకాశం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి గుర్తు చేశారు.

Section 377: It is danger to our national security says BJP MP Subramanian Swamy

స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా పేర్కొని దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో సమాజంలో దుష్ర్పవర్తనకు దారి తీస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

స్వలింగ సంపర్కం కారణంగా లైంగిక వ్యాధుల సంక్రమణకు దారి తీసే అవకాశం ఉందని, అది దేశానికి మంచిది కాదని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆరోపించారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ ముందు స్వలింగ సంపర్కులు గురువారం డ్యాన్స్ లు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+