విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం: ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
రాయ్పూర్: విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్వవహరించినందుకు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మంతురామ్ పవార్ ఇంటివద్ద భద్రత బాధ్యతల్లో ఉన్న ఈ నలుగురు పోలీసులు ఆ ప్రాంతంలోకి వచ్చిన నక్సలైట్లను పట్టుకోవడంలో విఫలమయ్యారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
దీంతో విధుల్లో బాధ్యతారహితంగా వ్వవహరించారనే ఆరోపణలతో వారిని సస్పెండ్ చేసినట్లు కనకేర్ ఎస్పీ ఆర్ఎన్ డాష్ తెలిపారు. ఛత్తీస్గఢ్ రాజధానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న పకాన్జోరేలో ఎమ్మెల్యే నివాసం ఉంది. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు నక్సలైట్లు... పౌరులు మాదిరి పవార్ ఇంట్లోకి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వచ్చారు.
దీంతో నక్సలైట్లు, పోలీసులు మధ్య కొంత సేపు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో పవార్ తన భార్యతో కలిసి రాయ పూర్ వెళ్లారు. ఇంట్లో పవార్ ఇద్దరు పిల్లలతో పాటు మేనల్లుడు ఉన్నారు. వారికి ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు. సస్పెండ్ చేసే ముందు వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.