గురి చూసి దెబ్బ కొట్టిన మేడమ్, ఎంపీ సీటు ఇవ్వలేదని ఎమ్మెల్సీకి రాజీనామా, తరువాత ఏంటి?
బీజేపీ సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మేడమ్ తేజస్విని గౌడ మళ్లీ కాంగ్రెస్లో చేరతారా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రాజీనామాలు చేసి పార్టీలు మారే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ వరుసలో బీజేపీ ఎమ్మెల్సీ తేజస్విని గౌడ కూడా చేరారు. తేజస్విని గౌడ ఈరోజు (బుధవారం) ఆమె రాజీనామా లేఖను కర్ణాటక శాసనమండలి స్పీకర్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. ఎమ్మెల్సీగా తేజస్విని పదవీకాలం జూన్ 24వ తేదీ వరకు ఉంది. అయితే పదవీ కాలానికి ముందే స్వచ్ఛందంగా తేజస్విని గౌడ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

తేజస్విని గౌడ రాజీనామాపై కర్ణాటక శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ తేజస్విని గౌడ్ మా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారని గుర్తు చేశారు. తేజస్విని గౌడ పదవీకాలం ఇంకా పూర్తి కాలేదని, మరో నెలలో ఆమె పదవి కాలం పూర్తి అవుతుందని అశోక్ అన్నారు. అయితే అన్ని పదవులు, అడిగిన సీట్లు ఇస్తే బీజేపీ చాలా మంచి పార్టీ, అలా చెయ్యకపోతే బీజేపీ చెడ్డపార్టీ అని చాలా మంది అనుకుంటున్నారని ఆర్ అశోక్ అన్నారు.
ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్ల పద్దతి సరిగా లేదని. అర్ అశోక్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని బీజేపీ ఆమోదించదని అశోక్ అన్నారు. రాజీనామా చేసిన తర్వాత కూడా తేజస్విని గౌడ తదుపరి ఎత్తుగడపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గత ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తేజస్విని గౌడ 2004లో కాంగ్రెస్ టికెట్పై కనకపుర ప్రస్తుతం బెంగళూరు రూరల్ లోక్సభ నియోజకవర్గం అంటే గతంలో కనకపుర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను ఓడించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎంపీగా పదవి కాలం పూర్తి అయిన తర్వాత తేజస్విని గౌడ బీజేపీలో చేరారు. ఈసారి మైసూరు-కొడగు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తేజస్విని గౌడ బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు.
అయితే తేజస్విని గౌడకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ హైకమాండ్ మైసూరు ఎంపీ టిక్కెట్ రాజవంశీయులు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్కు ఇచ్చారు. ఆ తర్వాత తేజస్విని గౌడ బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తేజస్విని గౌడ మళ్లీ కాంగ్రెస్లో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications