హిమాచల్.. మరో కేరళ?: ఆకస్మిక వరదల్లో పలువురు గల్లంతు
Himachal Pradesh floods 2024: కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 276 మృతదేహాలను బయటపడ్డాయి. మరో 240 మందికి పైగా గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియరావట్లేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్లోనూ దాదాపుగా ఇవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల అక్కడి నదులు ఉప్పొంగాయి. ప్రత్యేకించి- బియాస్ నది ఉగ్రరూపాన్ని దాల్చింది. తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది. పార్వతి నది ఎప్పుడూ లేని విధంగా వరదపోటుకు గురైంది.

ఈ వరదల్లో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతీయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రస్థాయి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటోన్నాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మనాలి జాతీయ రహదారి పలుచోట్ల కొట్టుకుపోయింది.
రాజధాని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. సిమ్లా జిల్లా పార్వతి నది వరదతాకిడికి గురైంది. ఝాక్రీ, సమేజ్ఖుద్, మండీ జిల్లాలోని రాజ్బాన్, మణికర్ణ్, సాత్ సబ్జీ గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 40 మంది గల్లంతయ్యారు.
కులు జిల్లాలోని మలానా రిజర్వాయర్కు పగుళ్లు ఏర్పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇక్కడి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీవ్రంగా దెబ్బతిన్నది. రాత్రి 11 గంటల నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. నీటి ప్రవాహం అనూహ్యంగా ఉండటం వల్ల తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను చేపట్టింది అక్కడి ప్రభుత్వం.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సిమ్లా అదనపు జిల్లా కలెక్టర్ డాక్టర్ మదన్ కుమార్, మండీ డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవగణ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications