పిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించి, లైంగిక వేధింపులు
బెంగళూరు: పేరుపొందిన అపార్టుమెంట్స్లో నివాసం ఉంటున్న పిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగిక దాడికి పాల్పడుతున్న సెక్యూరిటి గార్డును బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంకు చెందిన త్రిదేవ్ (22) అనే యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హెచ్ఏఎల్ సమీపంలోని కాడుబీచనహళ్ళి దగ్గర చాలా అపార్టుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సంవత్సరం నుండి త్రిదేవ్ సెక్యూరిటి గార్డుగా పని చేస్తున్నాడు. ఇతను అశ్లీల చిత్రాలు మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు.
అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో వారిని గోడ చాటుకు తీసుకు వెళ్లి, తన మొబైల్లోని అశ్సీల చిత్రాలు చూపించేవాడు. అశ్లీల చిత్రాలు చూపించి, వారి పైన లైంగిక దాడికి యత్నించేవాడు.
ఇటీవల త్రిదేవ్ కొందరు పిల్లల (అబ్బాయిలు) మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, త్రిదేవ్ను అరెస్టు చేశారు. గతంలోనూ అతను వేరే అపార్టుమెంట్స్లలో పని చేసినప్పుడు ఇలాగే పిల్లల మీద లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.