Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇది పెద్ద ఫ్రాడ్ భయ్యా.. కావాలంటే ఈ వీడియో చూడండి

Shambhavi Chaudhary: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌ ముగిసింది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 11వ జరుగనుంది. దీని తర్వాత 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో, లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు చెందిన సమస్తిపూర్ లోక్‌సభ సభ్యురాలు శాంభవి చౌదరి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. బీహార అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందనడానికి ఆమె పెద్ద ఉదాహరణగా నిలిచారు. తాను ఓటు వేసినట్లు మీడియా ముందు ఇంక్ మార్క్ ను చూపించే క్రమంగా రెండు వేళ్లను చూపించారామె. ఆ సమయంలో ఆమె తన తండ్రి, బీహార్ మంత్రి అశోక్ చౌదరి, తల్లి నీతాచౌదరి ఆమె పక్కనే ఉన్నారు. వారందరూ ఒక చేతి వేలిని మాత్రమే చూపగా.. శాంభవి చౌదరి రెండు వేళ్లనూ ప్రదర్శించారు.

Shambhavi Chaudhary was seen with ink marks on both hands after voting

తొలుత కుడిచేతి వేలిని చూపించారు. ఆ తర్వాత దాన్ని కిందికి దించి.. ఎడమ చేతి చూపుడు వేలిని చూపారు. రెండు చేతి వేళ్లకూ ఇంక్ మార్క్ ఉండటం స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె రెండుసార్లు ఓటు వేశారనడానికి ఇది ఉదాహరణ అంటూ ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి చెబుతోంది. శాంభవి చౌదరి రెండు చేతి వేళ్ళకూ ఓటు వేసిన ఇంకు గుర్తులు ఉన్నాయని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. శాంభవి చౌదరి రెండు చేతులతో ఓట్లను దొంగిలించారని విమర్శించింది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాట్నా జిల్లా ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. శాంభవి చౌదరి ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేశారని, పొరపాటున ఆమె రెండు చేతులకు ఇంకు వేశారని స్పష్టం చేశారు. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బుద్ధా కాలనీలో గల సెయింట్ పాల్స్ ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన 61వ పోలింగ్ బూత్ అధికారిని సంప్రదించామని, పోలింగ్ సిబ్బంది పొరపాటున శాంభవి కుడి చేతికి ఇంక్ వేశారని, ఆ తర్వాత ఎడమ చేతి వేలికి రాశారని అని తెలిపారు.

ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఎన్నికల్లో చోటు చేసుకుంటోన్న అక్రమాలకు ఆధారమని చెబుతున్నారు. ఓట్ చోరీ వ్యవహారం మీడియా ముందు అనుకోకుండా బయటపడిందని కామెంట్స్ పెడుతున్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఓ జోక్ గా మారిందని, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ నైతిక బాధ్యత వహించాలని సూచిస్తోన్నారు. ఎంపీగా ఉంటూ దొంగఓటు వేసిందంటూ ఆర్జేడీ- కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+