Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోటలో నమాజ్: బీజేపీ ఎంపీ 'గోమూత్రంతో పవిత్రం'! ఏంది ఈ రచ్చ? (వీడియో)

పుణెలోని చారిత్రక శనివార్ వాడ కోటలో కొందరు ముస్లిం మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. మరాఠా సామ్రాజ్యానికి చిహ్నంగా భావించే ఈ కోటలో జరిగిన ఈ ఘటనపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రతిపక్షాలు, మైనారిటీ వర్గాలు బీజేపీ ఎంపీ చర్యలను ఖండించాయి. దీంతో పుణెలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి.

బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి ఆధ్వర్యంలో 'శుద్ధి కార్యక్రమం'
వైరల్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి నేతృత్వంలో హిందూ సంస్థల బృందం కోట ఆవరణలో ఓ ప్రత్యేక 'శుద్ధి కార్యక్రమం' నిర్వహించింది. నమాజ్ చేసి ప్రాంతాన్ని గోమూత్రం(ఆవు మూత్రం)తో శుభ్రం చేసి ఆ తర్వాత శివ వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్యను సమర్థించుకుంటూ మేధా కులకర్ణి మాట్లాడుతూ.. "శనివార్ వాడ నమాజ్ చేయడానికి సరైన స్థలం కాదు. ఇది ప్రతి పుణె వాసికి ఆందోళన కలిగించే విషయం. ఈ వ్యక్తులు ఎక్కడపడితే అక్కడ నమాజ్ చేసి, ఆ స్థలాలను వక్ఫ్ ఆస్తిలో చేర్చే ప్రయత్నం చేస్తారు. అందుకే హిందూ సమాజం అప్రమత్తంగా ఉంది. ఈ చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. తాము కాషాయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారని కూడా ఆమె తెలిపారు.

Shaniwar Wada Namaz Controversy BJP MP Cow Urine Purification Sparks Political Storm

మంత్రుల మద్దతు.. ప్రతిపక్షాల విమర్శలు
మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కూడా కోటలో నమాజ్ చేయడాన్ని ఖండిస్తూ.. శనివార్ వాడ హిందూ సమాజానికి ఎంతో దగ్గరైన ప్రదేశమని పేర్కొన్నారు. మతపరమైన ఆచారాలు మసీదుల్లో చేసుకోవాలని సూచిస్తూ.. హాజీ అలీ వంటి ప్రాంతాల్లో హిందువులు హనుమాన్ చాలీసా పఠిస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించారు. అయితే బీజేపీ ఎంపీ గోమూత్రంతో శుద్ధి చేసిన చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.

ఎంపీ మేధా కులకర్ణి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్సీపీ ప్రతినిధి రూపాలి పాటిల్ థోంబ్రే డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ దేశ లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తోందని ఏఐఎంఐఎం ప్రతినిధి వారిస్ పఠాన్ విమర్శించారు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కును కల్పిస్తుండగా, కేవలం 3-4 మంది మహిళలు 3 నిమిషాలు నమాజ్ చేస్తే ఇంత ద్వేషం ఎందుకు? మీకు అంత ద్వేషం ఉంటే మీ మనస్సును శుద్ధి చేసుకోండి," అని ఘాటుగా స్పందించారు.

పోలీసుల చర్య, భద్రత కట్టుదిట్టం
ఈ వివాదాస్పద ఘటనపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారి ఫిర్యాదు మేరకు.. కోటలో నమాజ్ చేసిన గుర్తుతెలియని మహిళల బృందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివార్ వాడ ASI-రక్షిత కట్టడం కావడంతో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆవరణలో ఎవరినీ మతపరమైన కార్యక్రమాలకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+