శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్ దారుణ హత్య... దుండగుల కాల్పులు...
శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్(62)ను శుక్రవారం(అక్టోబర్ 16) ఉదయం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బల్వీందర్ తన ఇంటిని ఆనుకుని ఉన్న తన కార్యాలయంలో ఉన్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అదే ద్విచక్రవాహనంపై అక్కడినుంచి పరారయ్యారు. పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలోని భికివింద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సైన్యంలో పనిచేసినన్నీ రోజులు బల్వీందర్ సింగ్ ఎన్నో ఏళ్ల పాటు ఉగ్రవాదానికి ఎదురొడ్డి పోరాడారు.చాలా సందర్భాల్లో ఉగ్రవాదుల దాడుల నుంచి తప్పించుకున్నారు. బల్వీందర్ సేవలకు గుర్తింపుగా 1993లో రక్షణ శాఖ ఆయనకు శౌర్యచక్ర అవార్డును ప్రధానం చేసింది.

ఆయన ధైర్య సాహసాలపై ఇప్పటివరకు చాలానే డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. బల్వీందర్ మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Recommended Video
గతేడాది నుంచే ఆయనకు సెక్యూరిటీ నుంచి తొలగించినట్లు బల్వీందర్ బంధువు ఒకరు తెలిపారు. స్థానిక పోలీసుల సిఫారసు మేరకే ప్రభుత్వం ఆయనకు భద్రతను తొలగించిందన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications