నార్త్ ఈస్ట్ నుంచి షీలా, కపిల్ దక్కని సీటు : వీరే ఢిల్లీ కాంగ్రెస్ గెలుపు గుర్రాలు
న్యూఢిల్లీ : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తుపై స్పష్టత రాకపోవడంతో హస్తం పార్టీ తమ ఆరుగురు అభ్యర్థులతో లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆరు సీట్లలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించారు. దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు. మరో రెండురోజుల నామినేషన్ గడువు ముగుస్తోందనగ కాంగ్రెస్ పార్టీ వ్యుహాత్మకంగా వ్యవహరించి తమ అభ్యర్థులను ప్రకటించింది.
సిబల్ కు దక్కని సీటు
6 స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. చాందినీ చౌక్ నుంచి కపిల్ పోటీచేసే వారు .. కానీ ఆయనకు సీటు ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్ పోటీచేస్తుండగా .. ఇదివరకు ఇక్కడినుంచి పోటీచేసిన అజయ్ మాకెన్ ఢిల్లీ నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించారు.

వీరే గెలుపుగుర్రాలు
ఈస్ట్ ఢిల్లీ నుంచి అరవిందర్ సింగ్, జేపీ అగర్వాల్ చాందిని చౌక్, రాజేశ్ లిలోతియా నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ నుంచి మహబల్ మిశ్రా బరిలోకి దింపింది. వాస్తవానికి షీలా దీక్షిత్ ను ఎక్కడినుంచి పోటీచేస్తారని అడిగి .. మరీ సీటు కేటాయించారు.












Click it and Unblock the Notifications