క్రేజీ న్యూస్!, ఛాలెంజ్ చేస్తున్నా: కేసుపై ట్విట్టర్లో స్పందించిన శిల్పాశెట్టి
కోల్కత్తా: తమ నుంచి రూ. 9 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ ఫిర్యాదు చేయడం, కోల్కత్తా పోలీసులు కేసు నమోదు చేయడపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ట్విట్టర్లో స్పందించింది.
"క్రేజీ న్యూస్! మనోజ్ జైన్ (ఎంకే మీడియా బోర్డ్ డైరెక్టర్) చేస్తున్న వ్యాఖ్యలపై నేను ఛాలెంజ్ చేస్తున్నా. తను (జైన్) చేసిన వ్యాఖ్యలు నేను కష్టపడి సంపాదించుకున్న పాపూలారిటీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉంది. కేసుకు సంబంధించి న్యాయసలహా కోరుతున్నాం. అతనో డిఫాల్టర్, మెసగాడిని క్లియర్గా తెలుస్తోంది. ఇలాంటి వాటి పట్ల చాలా అసహ్యాంగా ఉంది" అని శిల్పాశెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Crazy news! I dare this Manoj Jain 2submit proofs 2 his ridiculous claims .His 2minute Fame can't b @ the cost of my hard earned reputation
— SHILPA SHETTY (@TheShilpaShetty) March 23, 2015 Seeking legal advice ..He's a defaulter &clearly a fraud going by his reputation.So annoying !
— SHILPA SHETTY (@TheShilpaShetty) March 23, 2015 ఇక ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఎంకే మీడియా చేసిన ఆరోపణలపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఇక ఆదివారం కోల్కత్తా పోలీసులు శిల్పాశెట్టి, భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఈ సంస్ధలో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ అదనపు డైరెక్టర్ దేబసిస్ గుహ కేసు పెట్టారు.

దీంతో పోలీసులు శిల్పా, ఆమె సంస్ధపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిల్పాశెట్టి నడుపుతున్న కంపెనీలో రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాకుండా, రెండేళ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని, మోసం చేశారని సదరు సంస్ధ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 9 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా శిల్పాశెట్టి కంపెనీ కేటాయించిన రూ. 30 లక్షల ఈక్వీటీ షేర్లు బోగస్ అని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
సాయి పల్లవి ఫ్యాన్స్కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications