Shock: సంతోషంగా ఇంటినుంచి వెళ్లాడు. రైలులో దారుణ హత్య, పక్కరాష్ట్రంలో ?
హుబ్బళి/బెంగళూరు/కర్నూల్: పక్క రాష్ట్రానికి వెలుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రైలులో పక్క రాష్ట్రానికి బయలుదేరాడు. ఇంటి నుంచి సంతోషంగా బయటకు వెళ్లిన తరువాత అతను అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చెయ్యలేదు. అదేరోజు రాత్రి రైలులోనే ఆ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పక్కరాష్ట్రంలో రైల్వేబోగిలో ఆ వ్యక్తి శవం గుర్తించారు. పక్కాప్లాన్ తో రైలులోనే అతన్ని చంపేశారని వెలుగు చూసింది.
Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !
కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని ఆదోని హనుమాన్ నగర్ లో ఆంజనేయ లక్ష్మణ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నవంబర్ 10వ తేదీన ఆంజనేయ తాను కర్ణాటకలోని హుబ్బళికి వెళ్లి వస్తానని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. తరువాత అదే రోజు ఆంజనేయ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
రైలులో దారుణ హత్య
గుంతకల్-హుబ్బళి ప్యాసింజర్ రైలు 07338లో ఆంజనేయ హుబ్బళికి బయలుదేరాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఆంజనేయ అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చెయ్యలేదు. అదేరోజు రాత్రి హుబ్బళి ప్యాసింజర్ రైలులోనే ఆంజనేయ దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.
చిన్న క్లూ చిక్కలేదు
ప్యాసింజర్ రైలులో ఆంజనేయను కత్తుతో పొడిచి దారుణంగా చంపేశారు. హుబ్బళిలో రైల్వే పోలీసులు ఆంజనేయ శవం గుర్తించి ఆదోనిలోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయకు ఎవ్వరు శత్రువులు లేరని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆంజనేయ హత్య కేసులో రెండు వారాలు అయినా హంతకులు చిక్కలేదని పోలీసులు అంటున్నారు.