Priest: అర్చకుడి నరబలి, ఒక గుడిలో మొండెం, మరో గుడి గేటుకు తల వేలాడి దీసి, నరబలి !
పాట్నా/బీహార్: ప్రముఖ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న అర్చకుడు స్థానికుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. 20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కాళీమాత ఆలయంలో పని చేస్తున్న అర్చకుడిు వివాహం చేసుకోలేదు. ప్రతిరోజు గుడిలో పూజలు చెయ్యడం, ఆలయం ఆవరణంలోని ఇంటిలోనే నిద్రపోవడం అర్చకుడికి కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది. రాత్రి గుడిలో పూజలు చేసిన అర్చకుడు ఇంటిలో భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న భక్తులు ఆలయంలో పూజలు చెయ్యడానికి వెళ్లారు. ఆలయం మొత్తం రక్తపు మరకలు ఉండటంతో హడలిపోయారు. గుడి ఆవరణంలోనే అర్చకుడి మొండెం పడిఉంది. ఆ గుడికి కిలో మీటరు దూరంలోని మరో గుడి గుమ్మం గేట్ కు అర్చకుడి తల వేలాడదీయడం కలకలం రేపింది.
కాళీమాత ఆలయంలో అర్చకుడు
బీహార్ లోని బేటియాదా సమీపంలోని పిప్రా గ్రామంలో కాళీమాత ఆలయం ఉంది. కాళీమాత ఆలయంలో రుడాల్ ప్రసాద్ వన్టాల్ అలియాస్ ప్రసాద్ స్వామి (55) అనే వ్యక్తి అర్చకుడిగా పని చేస్తున్నాడు. ప్రముఖ కాళీమాత ఆలయంలో పూజారిగా పని చేస్తున్న అర్చకుడు రుడాల్ ప్రసాద్ స్థానికుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు.
రాత్రి పూజలు చేసి నిద్రపోయిన అర్చకుడు
20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కాళీమాత ఆలయంలో పని చేస్తున్న అర్చకుడిు రుడాల్ ప్రసాద్ వివాహం చేసుకోలేదు. ప్రతిరోజు గుడిలో పూజలు చెయ్యడం ఆలయం ఆవరణంలోని ఇంటిలోనే నిద్రపోవడం అర్చకుడు రుడాల్ ప్రసాద్ కు కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది. రాత్రి గుడిలో పూజలు చేసిన అర్చకుడు రుడాల్ ప్రసాద్ ఆలయం ఆవరణంలోని ఇంటిలో భోజనం చేసి నిద్రపోయాడు.
ఒక గడిలో అర్చకుడి మొండెం..... మరో గుడిలో తల
ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న భక్తులు ఆలయంలో పూజలు చెయ్యడానికి వెళ్లారు. ఆలయం మొత్తం రక్తపు మరకలు ఉండటంతో హడలిపోయారు. గుడి ఆవరణంలోనే అర్చకుడు రుడాల్ ప్రసాద్ మొండెం పడిఉంది. ఆ గుడికి కిలో మీటరు దూరంలోని మరో గుడి గుమ్మంలో అర్చకుడు రుడాల్ ప్రసాద్ తల వేలాడదీయడం కలకలం రేపింది.
నరబలి అంటున్న ప్రజలు
అర్చకుడు రుడాల్ ప్రసాద్ మొండెం, తల ఒక కిలోమీటరు దూరంలో ఉన్న రెండు దేవాలయాల్లో వేలాడదీసి ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. అర్చకుడు రుడాల్ ప్రసాద్ ను నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా అంటోంది. అర్చకుడు రుడాల్ ను హత్య చెయ్యడానికి ఆలయం పైకప్పు నుంచి లోపలికి వెళ్లారని పోలీసులు అంటున్నారు.
మూగ అర్చకుడు
మొత్తం మీద బీహార్ లో అర్చకుడి తల పూర్తిగా నరికి కిలోమీటరు దూరంలోని మరో గుడిలో వేలాడదీయడం కలకలం రేపింది. అయితే హత్యకు గురైన అర్చకుడు రుడాల్ ప్రసాద్ మూగవాడని, మూగ అర్చకుడు ఇంతకాలం కాళీమాత ఆలయంలో పూజలు చేస్తున్నాడని స్థానిక మీడియా తెలిపింది.