షాకింగ్: ఆమె ఎంగిలి ప్రసాదం.. వారికి పరమ పవిత్రం.. అదే రాధేమా స్టయిల్!
వివాదాస్పద మాతాజీ రాధేమా కూడా భక్తుల మధ్య పలువిన్యాసాలు ప్రదర్శిస్తుంటుంది. ముఖ్యంగా రాధేమా భక్తులకు ప్రసాదాన్ని అందించే తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
జలంధర్: తనను తాను దేవీ అవతారంగా ప్రచారం చేసుకునే వివాదాస్పద రాధేమాపై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు అప్పీలు అందింది. ఈ నేపధ్యంలో హైకోర్టు... కపూర్తలా ఎస్ఎస్పీకి నోటీసు జారీచేసి సమాధానం కోరింది.
ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నడేరా బాబా మాదిరిగానే... రాధేమా కూడా భక్తుల మధ్య పలువిన్యాసాలు ప్రదర్శిస్తుంటుంది. ముఖ్యంగా రాధేమా భక్తులకు ప్రసాదాన్ని అందించే తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధేమా తన భక్తులకు ఏమిచ్చినా దానిలో వస్త్రం, త్రిశూలం తప్పనిసరిగా ఉంటాయి. రాధేమా తన నోటిలో చిన్నపాటి మిఠాయి పెట్టుకుని... భక్తుల దోసిట్లోకి దానిని పడవేస్తుంది.
ఇది అద్భుతమైన ప్రసాదమని భక్తుల భావన. ఇటువంటి ప్రసాదాన్ని అందుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచివుంటారు. ఇక రాధేమా ఎవరైనా భక్తుడిని లేదా భక్తురాలని తన ఒడిలోకి తీసుకుంటే వారి పంట పండినట్లే.
వారికి తప్పక అదృష్టం కలిసివస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదంగా భావిస్తారు. రాధేమా డాన్స్చేసే సందర్భంలో తమకు చిన్నపిల్లలా అనిపిస్తుందని భక్తులు చెబుతారు. అందుకే ఆమెను గుడియాదేవి మాగా అభివర్ణిస్తారట!