చిత్తుగా తాగేసి బార్ యజమానిపై కాల్పులు
బెంగళూరు: మద్యం సేవించిన దుండగులు ఆ తరువాత బార్ యజమానిపై హత్యాయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బార్ యజమాని సతీష్ మీద దుండగులు రివాల్వర్ తో కాల్పులు జరపారని పోలీసులు తెలిపారు.
బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని రెసిడెన్సీ రోడ్డులో టైమ్స్ బార్ ఉంది. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బార్ లో యజమాని సతీష్, సిబ్బంది ఉన్నారు.
ఇద్దరు నిందితులు బార్ లో మద్యం సేవించడానికి వెళ్లారు. తరువాత మద్యం సేవించారు. అదే సమయంలో సతీష్ బార్ లో స్టాక్ ఎంత ఉంది అని పరిశీలిస్తున్నాడు. ఒక్క సారిగా బయటకు వచ్చిన ఇద్దరు నిందితులు సతీష్ అంటూ కేకలు వేశారు.

జేబులో ఉన్న రివాల్వర్ లు తీసి కాల్పులు జరిపి పరారైనారు. సతీష్ శరీరంలోకి రెండు బుల్లెట్ లు దూసుకు వెళ్లాయి. వెంటనే సతీష్ ను మాల్య ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ సందీప్ పాటిల్ సంఘటా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మద్యం మత్తులో నిందితులు కాల్పులు జరిపారా, పాతకక్షల కారణంగా సతీష్ ను అంతం చెయ్యడానికి ప్రయత్నించారా అని ఆరా తీస్తున్నారు. బార్ లోని సీసీ టీవీ కెమెరా క్లిప్పింగ్ లను అశోక్ నగర పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications