సెక్స్ స్కాండల్, ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తేలేదు, మోదీకి తెలీకుండా జరుగుతుందా ?, సీఎం !
హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, ప్రజ్వల్ ఏ దేశానికి వెళ్లినా, అతను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ దాక్కున్నా అతన్ని మాత్రం కర్ణాటకకు తీసుకువస్తామని, లేదంటే ఆయనే భారతదేశానికి తిరిగిరావాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్పోర్టును రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని సీఎం సిద్దరామయ్య అన్నారు.
హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విషయమై శుక్రవారం బాగల్కోట్లో మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అంతర్జాతీయంగా పర్యటించాలనప్పుడు పాస్పోర్టు, వీసాలను తనిఖీ చేస్తారని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎవరూ దేశం వెలుపలకు వెళ్లలేరని, ఎవరూ దేశం వదిలి వెళ్లిపోరాని సిద్దరామయ్య అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందని సిద్దరామయ్య పరోక్షంగా ఆరోపణలు చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ వీడియోల గురించి తెలిసినా జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుందని సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి తమ ఇంటికి లాయర్లను పిలిపించి ఎందుకు చర్చించారు అని సిద్దరామయ్య ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో మాట్లాడిన కుమారస్వామి నేను వేరు కాదు, ప్రజ్వల్ రేవణ్ణ వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని హాసన్ లో చెప్పి ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు అందరూ రాజకీయాలు, పలు చర్యలు కలిసి చేసేవని సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణను మాత్రం వదిలే ప్రసక్తేలేదని, ఆయన్ను సిట్ అధికారులు విచారణ చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.

హుబ్బళిలో కాలేజ్ అమ్మాయి నేహా హత్య లవ్ జిహాద్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై స్పందించిన సిద్దరామయ్య మండిపడ్డారు. అమిత్ షా రాజకీయాలు చెయ్యడానికి ఇలాంటి ప్రకటన చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. నేహాని హత్య చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని సిద్దరామయ్య గుర్తు చేశారు. తరువాత నేహా కేసును సీఐడీకి అప్పగించామని, కేసు విచారణ వేగవంతం చెయ్యడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామని సిద్దరామయ్య అన్నారు. నేహా హత్య కేసులో నిందితుడిని చట్ట ప్రకారం శిక్షించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications