శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శివరాత్రి, ఉగాది లాంటి పర్వదినాల రోజు నాన్- వెజ్ తిన్నానని అన్నారు. ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి శుభ ముహూర్తం చూసుకోవాలన్న నమ్మకాలను ఆయన తిరస్కరించారు. ఈ మేరకు ప్రతిపక్షాల ఆందోళన మధ్య రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టైమ్ విషయంలో అలాంటి పట్టింపులు ఏమీ లేవని.. పండగల సమయంలో అందరూ వెజ్ ఫుడ్ తింటే.. తాను ఆ సమయంలోనే నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను శివరాత్రి రోజు మటన్ తిన్నానని.. శుభ ముహూర్తాలపై తనకు నమ్మకం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఆపాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాను ఇతరుల మాటలను గౌరవిస్తానని కానీ మూఢనమ్మకాలను మాత్రం ప్రోత్సహించనని తెలిపారు. ప్రభుత్వ పనులు చేయడానికి మంచి సమయం ఏంటని.. అన్ని రోజులు సమానమేనని స్పష్టం చేశారు.
ఆహారం, సమయం విషయంలో మత పరమైన కట్టుబాట్లను తాను విశ్వసించనని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. మూఢ నమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని అన్నారు. అధికార పార్టీ కావాలనే రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రాహుకాలం, యమగండం, గుళిక కాలం.. తదితర నమ్మకాలను తాను ఎప్పుడూ తిరస్కరిస్తానని స్పష్టం చేశారు. మూఢ నమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపలేమని పేర్కొన్నారు.

"నేను గతంలో అనేకసార్లు రాహుకాలంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టాను. ఈ సారి నేను ఆ విధానాన్ని మార్చుకోవాలని నా కుటుంబ సభ్యులు, అధికారులు నన్ను రిక్వెస్ట్ చేశారు. వారి మాటలను మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తాను. వ్యక్తిగతంగా నాకు రాహుకాలం లాంటి పట్టింపులు ఏమీ లేవు" అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ప్రతిపక్షనేత, బీజేపీ నాయకుడు ఆర్. అశోక.. ఈ అంశాన్ని తొలుత లేవనెత్తారు. రాహుకాలం అని తెలిసి కూడా సీఎం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications