Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎండిపోయిన కాలువలో చిన్నారి మృతదేహం.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు

ఇంటి ముందు అల్లరి చేస్తూ.. అందరి ముఖాల్లో నవ్వులు పూయించే ఆరేళ్ల చిన్నారి కనిపించడం లేదు. కన్న వారికి అక్కడి భాష రాదు. చిన్నారి కోసం వెతికి వెతికి అలసిపోయిన ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే ఎండిపోయిన కాలువలో బాలిక మృతదేహం కనిపించింది. గొంతు నులిమి చిన్నారిని చంపేసింది ఎవరు? లైంగిక దాడి జరిగిందా. దర్యాప్తులో బయటపడిన షాకింగ్ నిజాలు.

ఆరు ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. బెంగళూరు ఈస్ట్ ప్రాంతంలోని పట్టందూర్ అగ్రహారంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు నివాసం ఉంటున్నారు. వీరంతా రూజువారి పనులు చేసుకుంటూ నివాసం సాగిస్తున్నారు. ముఖ్యంగా వీరందరూ నిర్మాణ రంగంలో కూలి పనులకు వెళ్తుంటారు. అందరిలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారికి ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. వారితో పాటే కూలి పనులకు వెళ్లి అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. మంగళవారం సాయంత్రం కూలీలంతా పని ముగించుకుని తమ నివాసాలకు చేరుకున్నారు. అయితే అలిసిపోయిన ఆ దంపతులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆ చిన్నారి మాత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. బాగా రాత్రి అవుతున్నా తిరిగి రాలేదు. అయితే పక్కన ఇంట్లోనే, ఎదురు ఇంట్లోనో లేదా స్థానికంగా ఉండే పిల్లలతోనో ఆడుకుంటుందని భావించారు తల్లిదండ్రులు. పాప కోసం ఆ ప్రాంతం అంతా వెతికారు. ఈ లోపే పాప కనబడటం లేదనే వార్త ఆ బస్తీ అంతా వ్యాపించేసింది. మంగళవారం రాత్రి వరకు ఆ బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎదురుచూశారు. కానీ వారికి ఎలాంటి ఆచూకి లభించలేదు. దీంతో ఆమె తండ్రి ఇంజాముల్ షేక్ మంగళవారం( జనవరి 6న) సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి సమీపంలో నివసించే, అదే రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు యూసుఫ్ మీర్ పై అనుమానం వ్యక్తం చేశారు.

Six year old girl body found in dry canal in Bengaluru

వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మీప ప్రాంతాలను తనిఖీ చేయగా, బాలిక మృతదేహం ఎండిపోయిన కాలువలో లభ్యమైంది. దీంతో ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. ప్రాథమిక విచారణలో బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. యూసుఫ్ మీర్ పాపను లైంగికంగా వేధించి హతమార్చి ఉంటాడని పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బస్తీలో హైటెన్షన్ నెలకొంది. లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని, పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారి హత్య ఘటనతో బస్తీలో భయాందోళనలు నెలకొనగా, చిన్నారికి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+