కిడ్నాప్పై క్షేమంగా తిరిగొచ్చిన స్నాప్డీల్ ఉద్యోగిని
న్యూఢిల్లీ: కనిపించకుండా పోయిన దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్కు చెందిన ఉద్యోగిని దీప్తీ సర్నా(24) క్షేమంగా తిరిగొచ్చింది. దీప్తి శుక్రవారం ఉదయం ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
గుర్గావ్లో బుధవారం సాయంత్రం దీప్తి తన కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఆమె అపహరణకు గురైంది. రోజూ మెట్రోలో వెళ్లే దీప్తి బుధవారం ఆటోలో ఇంటికి వెళుతున్న సమయంలో బెంగళూరులో ఉన్న తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.

అప్పుడే ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళుతున్నాడని అతనిపై అరుస్తున్నట్లు ఫోన్లో వినిపించిందని దీప్తి స్నేహితురాలు తెలిపింది. ప్రస్తుతం దీప్తి క్షేమంగానే ఉన్నట్లు తెలియడంతో స్నాప్డీల్ యాజమాన్యం, ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, తాను ఆటోలో ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు తనను కిడ్నాప్ చేశారని దీప్తి తెలిపింది. తన కళ్లకు గంతలు కట్టు మీరట్ వరకు తీసుకెళ్లారని చెప్పింది. తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని చెప్పింది. ఆ తర్వాత తనను నరేలా ప్రాంతంలో వదిలిపెట్టినట్లు దీప్తి తెలిపిందని సీనియర్ పోలీస్ అధికారి ధర్మేంద్ర సింగ్ తెలిపారు. అయితే, దీప్తి ఫోన్, బ్యాగ్ మిస్సయ్యాయని చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications