ఓటువేసిన అన్నా హజారే, హీరాబెన్ ! 98 ఏళ్ల వయస్సులో..
ముంబై/అహ్మదాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్ పాల్ బిల్లు ఉద్యమకర్త అన్నా హజారే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సరళి పట్ల స్పందించడానికి నిరాకరించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానాన్ని దాటవేశారు. ప్రస్తుతం తాను రాజకీయాలేవీ మాట్లాడట్లేదని చెప్పారు.

98 ఏళ్ల వయస్సులో..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లో ఓటు వేశారు. 98 ఏళ్ల వయస్సులో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అహ్మదాబాద్ లోని రైసన్ ప్రాంతంలో ఆమె ఓటు వేశారు.

ఈ సందర్భంగా హీరాబెన్ వెంట.. ఆమె బంధువులు, భద్రతాధికారులు ఉన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వెంటనే.. అక్కడి సిబ్బంది హీరాబెన్ కు చప్పట్ల కొడుతూ స్వాగతం పలికారు. అంతకుముందు- ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ను కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications