సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు: హత్య చేశారనేదానికి సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డ సీబీఐ కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోహ్రాబుద్దీన్, తులసీప్రజాపతి బూటకపు ఎన్కౌంటర్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై మోపబడిన అభియోగాలను రుజువు చేయడంలో సీబీఐ విఫలమైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సోహ్రాబుద్దీన్ది బూటకపు ఎన్కౌంటర్ అని నిరూపించడంలో సీబీఐ తగిన సాక్షాధారాలతో రుజువు చేయలేకపోయిందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి మొత్తం 22 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువగా గుజరాత్, రాజస్థాన్లకు చెందిన జూనియర్ పోలీసులు ఉండటం విశేషం. సోహ్రాబుద్దీన్కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న చెబుతూ అతన్నిపోలీసులు చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించారని సీబీఐ పేర్కొంది. నవంబర్ 2005లో సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ జరిగింది. సోహ్రాబుద్దీన్ మృతి చెందిన నెల రోజులకు అతని భార్య కౌసర్బీని కూడా హతమార్చడం జరిగింది. ఆ తర్వాత సోహ్రబుద్దీన్ మిత్రుడు ప్రజాపతిని కూడా డిసెంబర్ 2006లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి 210 మంది సాక్షులను విచారణ చేశారు. ఈ నెల మొదట్లో కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేయడం ముగిసింది. తీర్పును డిసెంబర్ 21కి రిజర్వ్ చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు.

2010లో సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఆ సమయంలో 38 మందిపై కేసు నమోదు చేసింది. వీరిలో నాటి గుజరాత్ హోంమంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు గుజరాత్ రాజస్థాన్ పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. అయితే 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ నుంచి ముంబైకి కేసు బదిలీ అయ్యింది. ఆ సమయంలో అమిత్ షా, గుజరాత్ పోలీస్ ఛీఫ్ పీసీ పాండే , యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఛీఫ్ డీజీ వంజారాలతో పాటు మరో 16 మందికి క్లీన్ చిట్ వచ్చింది. అయితే తన సోదరుడిది బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు రుబాబుద్దీన్. అంతేకాదు డీజీ వంజారాతో పాటు మరో నలుగురు పోలీస్ ఉన్నతాధికారులకు ఊరటనివ్వడాన్ని బాంబే హైకోర్టులో సవాల్ చేయగా ఆయన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications