మోడీ ప్రభుత్వం వచ్చాక..: ఏకిపారేసిన సోనియా గాంధీ
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ పైన, ఎన్డీయే ప్రభుత్వం పైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్డీయే పాలనలో మతఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో మత ఘర్షణలు ఎక్కువగా అవుతున్నాయని, ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలలో ఇవి జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
భారత దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో మత ఘర్షణలు చాలా తక్కువగా జరిగాయన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వందలాది మత హింస ఘటనలు జరిగాయన్నారు. విద్రోహ శక్తులను ఎదుర్కోవడానికి అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో చాలా మత ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో గాజా అంశం పైన కూడా మోడీ ప్రభుత్వం పైన సోనియా మండిపడ్డారు.
లోకసభలో చర్చకు పట్టుబట్టేందుకు తమకు సరైన బలం లేదని, రాజ్యసభలో మాత్రం ఉందని చెప్పారు. తాము పాలస్తీనియన్లకు మొదటి నుండి సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. మోడీ పాలనలో మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications