నా పది లక్షలు నాకు తెచ్చివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా..అసెంబ్లి సాక్షిగా ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ...
యూపి...పది లక్షలు దోంగిలించినా... పోలీసులు పట్టించుకోవడం లేదు, నేను చాల బీదవాడిని, నా పది లక్షలు నాకు తెచ్చివ్వక పోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను...ఇలాంటీవి చాల చదివాం అనుంటున్నారా ఒక్కసారి స్టోరీ మొత్తం చదవండి ..మీరే అశ్ఛర్యపోతారు....
పై వ్యాఖ్యలు ఓ సాధరణ పౌరుడు చేసిన కామెంట్స్ కావు...సాక్షత్తు యూపి అసెంబ్లి లో జరిగిన సంఘటన ఇది...అసెంబ్లిలో ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు....యూపి మెహ్నానగర్ నియోజకవర్గం
సమాజ్ వాదిపార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్పనాధ్ పాశ్వాన్ సోమవారం యూపి అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో జీరో అవర్ లో ప్రస్థావించారు.తనకు చెందిన పది లక్షల రుపాయాలు ఆజాంగర్ లోని ఓ హోటల్ లో దోంగిలించారని స్పికర్ కు మొరపెట్టుకున్నారు..దానిపై ఇంకా కేసుకూడా నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.నేను చాల పేదవాడినని..అవి తిరిగి తెచ్చివ్వక పోతే ఆత్మహత్య చేసుకుంటానని మొరపెట్టుకున్నారు. చేతులు జోడించి వేడుకుంటున్నాను డబ్బులు తిరిగి తెచ్చివ్వాలని కోరారు..

కాగా ఎమ్మెల్యేకు సమాధానం చెప్పిన అసెంబ్లి వ్యవహరాల మంత్రి సురేష్ కుమార్ దీనీపై తీవ్రంగా స్పందించారు..దీనిపై పూర్తి నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ హోంశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏది ఏమైనా యూపి పోలీసులు ఇంతా దారుణంగా ఒక ఎమ్మెల్యే వద్ద దోంగతనం జరిగిన పట్టించుకోలేదంటే, వారు ఇక సామాన్యప్రజలకు ఎలాంటీ న్యాయం చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి...












Click it and Unblock the Notifications