నీఅయ్యదా: బాబుపై పొన్నం, అవిశ్వాసానికే ములాయం

SP will not support Seemandhra MPS NCM
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకసభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం పొన్నం, రాజయ్య తదితరులు విలేకరులతో మాట్లాడారు.

అసెంబ్లీ బిల్లు రాష్ట్రానికి వచ్చిన విషయం తెలియగానే చంద్రబాబు కల్లు తాగిన కోతిలా ప్రవర్తించారన్నారు. విభజన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జాగీరా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని.. అసలు తెలంగాణ ఆయన అయ్య జాగీరా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబు సొంత పార్టీ ఎంపీలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

ములాయం మద్దతు

తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) దాదాపు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీకి చెందిన ఆరుగురు, సీమాంధ్ర టిడిపికి చెందిన నలుగురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వారు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రయత్నంలో భాగంగా వారు ఎస్పీని కూడా కలిశారు. అవిశ్వాసానికి మద్దతిస్తామని టిడిపికి హామీ ఇచ్చిందంట. ఎస్పీ విభజనకు విముఖంగా ఉంది. దీంతో ములాయం మద్దతు పలకవచ్చునని మొదటి నుండి అందరూ భావించారు. ఎస్పీకి 21 మంది ఎంపీల మద్దతు ఉంది. ఎస్పీ, శివసేన, అకాలీదళ్, బిజెడిలు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాయి. తమను సంప్రదించకుండా లోక్‌పాల్ బిల్లు పైన ముందుకు వెళ్లడం ఎస్పీకి ఆగ్రహం కలిగిస్తోందట.

తాము ధరల పెరుగుదల, అంతర్గత భద్రత పైన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు చెప్పారు. తాము అవిశ్వాసం పెట్టింది తెలంగాణ అంశంపై కాదన్న విషయాన్ని బిజెపి గుర్తించాలని కోరారు. తమ అవిశ్వాసానికి మద్దతివ్వాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+