కూలిపోయిన సుఖోయ్ యుద్ధ విమానం..??
అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని చోకిహోలా సమీపంలో గురువారం రాత్రి భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన సుఖోయ్ సు-30ఎమ్కేఐ యుద్ధ విమానం రాడార్తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని ధృవీకరించగా, విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, పైలట్ ఆచూకీ గల్లంతైందని తెలిపింది.
ఈ ఘటనపై ఐఏఎఫ్ తక్షణమే గాలింపు చర్యలు చేపట్టింది. భారత వైమానిక దళం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఒక ఐఏఎఫ్ సు-30ఎమ్కేఐ విమానం కనిపించడం లేదని సమాచారం. అస్సాం జోర్హాట్ నుండి బయలుదేరిన ఈ విమానం చివరిసారిగా రాత్రి 7:42 గంటలకు సంప్రదింపుల్లో ఉంది. తదుపరి వివరాలు సేకరిస్తున్నాము. గాలింపు, సహాయక మిషన్ ప్రారంభించింది."
ఇదే తరహా ఘటన గతంలోనూ నమోదైంది. 2024 జూన్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక సుఖోయ్ సు-30ఎమ్కేఐ విమానం మిస్సింగ్ అయింది. వైమానిక దళం ప్రకారం నిఫాడ్ తహసీల్ లోని శిరస్గావ్ గ్రామం సమీపంలో ఆ విమానం కూలిపోయింది. అయితే పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడగలిగారు.

సుఖోయ్ సు-30ఎమ్కేఐ అనేది గగనతల ఆధిపత్య మిషన్ల కోసం రూపొందించబడిన రెండు ఇంజిన్లు, రెండు సీట్ల 4.5వ తరం ఫైటర్ విమానం. దీనిని రష్యాకు చెందిన సుఖోయ్ అభివృద్ధి చేయగా, భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేస్తోంది. సుమారు 3,000 కిలోమీటర్ల పరిధి, బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యంతో, సు-30ఎమ్కేఐ భారత వైమానిక దళం యుద్ధ సముదాయంలో కీలక భాగం. ప్రస్తుతం, ఐఏఎఫ్ దాదాపు 270 సుఖోయ్ సు-30ఎమ్కేఐలను నడుపుతోంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications