సుప్రీం సంచలనం: రేప్ బాధితురాలి అబార్షన్కు అనుమతి
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన అత్యాచార బాధితురాలు తన 24 వారాల ప్రగ్నెన్సీని అబార్షన్తో తొలగించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అనుమతి ఇచ్చింది. బాధితురాలి మెడికల్ రిపోర్టల ప్రకారం శిశువు ఎదుగుదల సరిగా లేకపోవడం ఒక కారణం కాగా, శిశువు పెరుగుదల వల్ల తల్లి ప్రాణాలకు ప్రాణాపాయం ఉండడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే... తన మాజీ ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురైన ముంబైకి చెందిన మహిళ గర్భం దాల్చింది. అయితే ఆ మహిళకు అబార్షన్ చేసేందుకు వైద్యులు నిరాకరించడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భారత చట్ట ప్రకారం 20 వారాలు దాటిన గర్భాన్ని తొలగించకూడదన్న నిబంధన ఉండడంతో ముంబై వైద్యులు ఆమెకు ఆబార్షన్ చేసేందుకు నిరాకరించారు.
రేప్ బాధితురాలి అబార్షన్కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ముంబైకి చెందిన అత్యాచార బాధితురాలు తన 24 వారాల ప్రగ్నెన్సీని అబార్షన్తో తొలగించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అనుమతి ఇచ్చింది.
రేప్ బాధితురాలి అబార్షన్కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
జస్టిస్ జగ్దీష్ సింగ్ ఖేహర్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య బెంచ్ తల్లి ప్రాణాలకు ప్రాణపాయం ఉన్న నేపథ్యంలో గర్బం తొలగించవచ్చని సోమవారం తీర్పు వెలువరించింది.
రేప్ బాధితురాలి అబార్షన్కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
శుక్రవారం సుప్రీంకోర్టు మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలియజేయాలని ముంబైలోని కేఈఎం ఆస్పత్రిని ఆదేశించింది. తీర్పు నేపథ్యంలో ఏడుగురు వైద్యులతో కూడిన బృందం ఆమెకు శుక్రవారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదికను అందజేయనున్నారు.
రేప్ బాధితురాలి అబార్షన్కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఇదిలా ఉంటే మెడికల్ బోర్డ్ కూడా గర్భస్థ శిశువుకు అవయవాల పెరుగుదల సరిగా లేదని, గర్భాన్ని అలాగే ఉంచితే తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చింది. వీటి ఆధారంగా నేడు సుప్రీంకోర్టు గర్భం 20 వారాలు దాటినప్పటికీ అబార్షన్ చేయొచ్చని తీర్పును వెల్లడించింది.