హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ.. ఏపీకి ఒకరు, తెలంగాణకు ముగ్గురు
సుప్రీం కోర్టు కొలీజియం మే 26న జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీలకు సిఫారసు చేసింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరెవరు.. ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో బదిలీలు..
న్యాయమూర్తి సుజోయ్ పాల్ - తెలంగాణ నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ.
న్యాయమూర్తి సి.సుమలత - కర్ణాటక నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ.
న్యాయమూర్తి లలిత కన్నెగంటి - కర్ణాటక నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ.
న్యాయమూర్తి అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి - పట్నా నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ.
న్యాయమూర్తి బట్టు దేవానంద్ - చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ.

ఇతర రాష్ట్రాల్లో బదిలీలు..
న్యాయమూర్తి వి. కామేశ్వర్ రావు - కర్ణాటక నుంచి ఢిల్లీకి.
న్యాయమూర్తి లనుసుంకుమ్ జామిర్ - గౌహతి నుంచి కలకత్తా కు.
న్యాయమూర్తి మనాష్ రంజన్ పాఠక్ - గౌహతి నుంచి ఒరిస్సా కు.
న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సంప్రే - బాంబే నుంచి ఢిల్లీకి.
న్యాయమూర్తి అశ్విని కుమార్ మిశ్రా - అలహాబాదు నుంచి పంజాబ్ & హర్యానా కు.
న్యాయమూర్తి సుమన్ శ్యామ్ - గౌహతి నుంచి బాంబే కు.
న్యాయమూర్తి సంజీవ్ ప్రకాశ్ శర్మ - పంజాబ్ & హర్యానా నుంచి రాజస్థాన్ కు.
న్యాయమూర్తి వివేక్ చౌధరీ - అలహాబాదు నుంచి ఢిల్లీకి.
న్యాయమూర్తి దినేశ్ కుమార్ సింగ్ - కేరళ నుంచి కర్ణాటకకు.
న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ - చెన్నై నుంచి మధ్యప్రదేశ్కు.
న్యాయమూర్తి ఓం ప్రకాష్ శుక్లా - అలహాబాదు నుంచి ఢిల్లీకి.
న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్ - రాజస్థాన్ నుంచి బాంబే కు.
న్యాయమూర్తి సుధీర్ సింగ్ - పంజాబ్ & హర్యానా నుంచి పట్నా కు.
న్యాయమూర్తి అనిల్ ఖేతర్పాల్ - పంజాబ్ & హర్యానా నుంచి ఢిల్లీ కి.
న్యాయమూర్తి అరుణ్ కుమార్ మోంగా - రాజస్థాన్ నుండి ఢిల్లీ కి.
న్యాయమూర్తి జయంత్ బెనర్జీ - అలహాబాదు నుంచి కర్ణాటక కు.
ఈ బదిలీలన్నీ కొలీజియం సిఫారసు మేరకు తుది ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపబడతాయి. ఆ తర్వాత సర్కారు ఆమోదం తర్వాత ఆయా స్థానాలను ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications