SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో అనర్హులుగా తేలి ఓటర్లుగా తొలగించిన వారి విషయంలో సుప్రీంకోర్టు (supreme court) ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. సరైన గుర్తింపు కార్డులు లేవనే కారణంతో వీరు మన పౌరులు కాదని, విదేశీయులే అంటూ ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. అస్సాంలో ఈ మేరకు 27 మందిని విదేశీయులుగా గుర్తిస్తూ ట్రైబ్యునళ్లు తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది.
మన దేశ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒకరిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పౌరసత్వం, విదేశీయుడి హోదా అనేవి అత్యంత రాజ్యాంగ, చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలని కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో, వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వం కోసం చేసే వాదనలను నిరోధించడంలో భారత ప్రభుత్వానికి గణనీయమైన ఆసక్తి ఉందని కూడా కోర్టు అంగీకరించింది.

చట్టబద్ధంగా భారత పౌరసత్వం పొందేందుకు అర్హత లేని వ్యక్తులు, ఈ ప్రక్రియను దుర్వినియోగం చేయడం ద్వారా, తప్పుడు వాదనల ద్వారా లేదా జాప్యం చేయడం ద్వారా అలాంటి హోదాను పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అది న్యాయపరమైన నిష్పక్షపాతాన్ని అధిగమించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత, గౌహతి హైకోర్టు, టైబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ట్రిబ్యునల్స్ మరో విచారణ జరిపే వరకు విదేశీయులుగా ముద్రపడిన 27 మంది వ్యక్తులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications