కోర్టు కేసులపై మీడియా విచారణా ? సుప్రీంకోర్టు ఫైర్-చంద్రబాబు అరెస్టు వేళ ప్రాధాన్యం ?
దేశవ్యాప్తంగా కోర్టుల్లో విచారణ సాగుతున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు నిర్వహించడంపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో సాగే పక్షపాత రిపోర్టింగ్ వల్ల సదరు నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అడ్డుకునేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రాల డీజీపీలు, జాతీయ హక్కుల కమిషన్ కూడా నెలరోజుల్లో సూచనలు ఇవ్వాలంది.
మీడియాలో సాగే విచారణల వల్ల కోర్టుల్లో సాగే న్యాయవిచారణ ప్రభావితమవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో పోలీసు సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలన్నారు.ఏ దశలో దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయాలో వారు నిర్ణయించుకోవాలని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య అని,ఎందుకంటే ఇది బాధితుల, నిందితుల ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. అలాగే ప్రజాప్రయోజనాలను కూడా కలిగి ఉంటుందన్నారు.

ప్రాథమిక స్థాయిలో ఆలోచనలు, వార్తలను చిత్రీకరించడానికి, ప్రసారం చేయడానికి మీడియాకు ఉన్న హక్కు రెండింటిలోనూ ప్రసంగం, భావవ్యక్తీకరణ యొక్క ప్రాథమిక హక్కుతో నేరుగా ప్రమేయం కలిగి ఉందని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కానీ మనం 'మీడియా విచారణ'ని అనుమతించకూడదన్నారు. ప్రజలకు చర్చించే హక్కు ఉన్నా, విచారణ సమయంలో ముఖ్యమైన సాక్ష్యాలు వెల్లడైతే, దర్యాప్తును కూడా ప్రభావితం చేయవచ్చని తెలిపారు.
ఇదే అంశంపై 2017 నాటి సూచనలకు సంబంధించిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది. నిందితులు, బాధితురాలి హక్కులను దృష్టిలో ఉంచుకుని పోలీసు బ్రీఫింగ్ల కోసం నిబంధనలను రూపొందించాలని, ఇరుపక్షాల వారు ఏ విధంగానూ పక్షపాతం లేదా ఉల్లంఘించకుండా చూసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ముసాయిదా నివేదికను సమర్పించేందుకు కేంద్రానికి కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చింది.
ఏపీలో ప్రస్తుతం విపక్ష నేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై పలు జాతీయ మీడియా ఛానళ్లతో పాటు రాష్ట్రంలోని ప్రాంతీయ మీడియా ఛానళ్లలోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు తప్పుచేశారని కొందరు, చేయలేదని మరికొందరు తమ వంతు విచారణలు నిర్వహించేస్తున్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు చంద్రబాబు ఎపిసోడ్ లో మీడియా పనితీరుకు అద్దం పట్టేలా ఉన్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications