కోవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు - Newsreel

సుప్రీంకోర్టు

కోవిడ్‌తో మరణించినవారి కుటుంబీకులకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ రిజర్వ్‌లో ఉంచింది.

2005 నాటి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 12 అనుసారం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ ప్రకారం ఈ పరిహారం అమలు చేయాలంటూ పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఈ కేసులో విచారణను పూర్తిచేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలో జస్టిస్ ఎంఆర్ షా ఉన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. మూడు రోజుల్లోగా దీనిపై రాతపూర్వకంగా వివరాలు దాఖలు చేయాలని రెండు పక్షాలను ఆదేశించింది.

బాధితులకు ఏదైనా పథకం రూపంలో కానీ మార్గదర్శకాల ప్రకారం కానీ ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌దారుల్లో ఒకరైన న్యాయవాది గౌరవ్ బన్సల్ కోర్టును కోరారు.

కాగా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై తన వాదనలు వినిపిస్తూ.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఈ కరోనా మహమ్మారికి వర్తిస్తుందని.. దాని ప్రకారమే ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల డిజాస్టర్ రెస్పాన్స్ వ్యవస్థలకు నిధులు ఇచ్చిందని, కోవిడ్ ప్రభావిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నమూ చేసిందని తెలిపారు.

ఆక్సిజన్ సరఫరా, ఇతర అత్యవసర సహాయాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ మైగ్రేషన్ యాక్ట్ పరిధిలో కానీ జరిగాయని చెప్పారు.

కోవిడ్ ప్రభావం తగ్గించే చర్యలు, సన్నద్ధతా చర్యలపై ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు దృష్టి పెట్టిందని ఆయన కోర్టుకు తెలిపారు.

ఆర్థిక సంఘం సలహాలు, సూచనలన్నిటినీ పార్లమెంటు ఆమోదించిందని.. ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకుండా చూస్తామని తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు.

మోదీ

నిన్న జరిగిన కేసు విచారణ సందర్భంగా, కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమని వివరించింది.

కరోనా సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ దాఖలుచేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.

''కోవిడ్ సంక్షోభంలో చిక్కుకున్న వారి కోసం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఇప్పటికే మా ఖజానాలపై చాలా భారం పడుతోంది'' అని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

''కోవిడ్‌తో పెద్దయెత్తున మరణాలు సంభవించడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలతోపాటు దేశానికి ఇది తీర్చలేని లోటు.''

''ఇది ఒక విపత్తులాంటి సమయం. మన దేశంలో కరోనావైరస్ పెద్దయెత్తున విజృంభించింది. దీన్నుంచి ప్రజలను రక్షించేందుకు భిన్న చర్యలు, వ్యూహాలు అవసరం అవుతాయి. ఈ పరిస్థితులు మాకు సవాల్ విసురుతున్నాయి'' అని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+