ఉన్నావ్ ఘటనపై సుప్రీంకోర్ట్ సీరియస్.. నాలుగు కేసులు ఢిల్లీకి బదిలీ చేస్తామన్న సీజేఐ..
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసును సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అత్యాచార ఘటన, తాజాగా బాధితురాలి ప్రమాదానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే నిందితుడైనందున కేసు విచారణ ఉత్తర్ప్రదేశ్లో సజావుగా సాగకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉన్నావ్ ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి సంబంధించి దాఖలైన పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమకు రక్షణ కల్పించాలంటూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కు రాసిన లేఖను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఉన్నవ్ బాధితురాలిని రేప్ అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్,ఆయన బంధువులు సహా 9మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి సీబీఐను నివేదిక కోరింది.

కేసు విచారణలో భాగంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ప్రస్తుతం లక్నోలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. మధ్యాహ్నం 12గంటల్లోగా కోర్టు ముందు హాజరుకావడం అసాధ్యమని సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి చెప్పారు. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. అయితే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించింది. సీబీఐ డైరెక్టర్ సదరు అధికారితో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవచ్చని సూచించింది. సీబీఐ అధికారి ఇచ్చే వివరాల ఆధారంగా ఉన్నావ్ బాధితురాలికి సంబంధించిన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications