వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో ఎబోలా కలకలం, భయం లేదని డాక్టర్స్ వెల్లడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Suspected Ebola case: No Ebole in Mumbai
ముంబై: ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎబోలా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తికి మహారాష్ట్రలోని ముంబై వైద్యులు చికిత్స అందిస్తున్నారన్న సమాచారం కలకలం రేపింది. ఇటీవలే ఎబోలా ప్రబలిన నైజీరియా నుంచి ముంబై వచ్చిన లలిత్ కుమార్ అనే వ్యక్తికి వచ్చీ రాగానే వాంతులు మొదలైన నేపథ్యంలో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించిన వైద్యులు, అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు.

అంతేకాక అతడి నుంచి సేకరించిన నమూనాలను పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ శెట్టి తెలిపారు. లలిత్ కుమార్‌కు ఎబోలా సోకిందని నిర్ధారణ కాలేదని వైద్యులు చెప్పారు. భారత్‌లో, ముంబైలో ఎలాంటి ఎబోలా కేసు లేదని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు, ఇదిలా ఉంటే, ఆఫ్రికా నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి ఎబోలా సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. అతడి నమూనాలను పరిశీలించిన పూణె వైరాలజి ప్రయోగశాల, నమూనాల్లో ఎబోలా వ్యాధి లక్షణాలు లేవని తేల్చేసింది.

దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ సోమవారం బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు అమలులో ఉండే ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య బృందాలను నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఎబోలా వ్యాపిస్తున్న నైజీరియాలో రోగుల సంఖ్య పదికి పెరిగింది. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం అత్యవసరస్థితిని ప్రకటించింది. మూడు నెలల పాటు ఇది అమలులో ఉంటుంది.

English summary
A man who got himself admitted in a citic run hospital in Vasai suspecting himself to be affected by the Ebole virus was discharged by the hospital on Monday and the case dismissed as a fase alarm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X