Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Swamiji: ఫేమస్ మఠంలో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ, ఏం జరిగింది ? !

బెంగళూరు/రామనగర: అక్షరభ్యాసం, అన్నదానం చెయ్యడంతో ఆ మఠానికి చాలా పేరుప్రతిష్టలు ఉన్నాయి. ప్రముఖ మఠానికి మంచి పేరు ఉంది. ఇటీవల మఠం 25 సంవత్సరాల వార్షికోత్సవం ఘనం నిర్వహించారు. ఆ మఠాధిపతి అందరి దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. మఠాధిపతి నిత్యం సమాజసేవ చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించారు. గదిలోని కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు. అయితే స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఫేమస్ మఠం

ఫేమస్ మఠం


బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) పని చేస్తున్నారు. అక్షరభ్యాసం, అన్నదానం చెయ్యడంతో కుంచుగల్ బండే మఠానికి రామనగర జిల్లాతో పాటు కర్ణాటకలో చాలా పేరుప్రతిష్టలు ఉన్నాయి.

 25 సంవత్సరాల వార్షికోత్సవం

25 సంవత్సరాల వార్షికోత్సవం

కంచుగల్ బండే మఠానికి రామనగర జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో మంచి పేరు ఉంది. ఇటీవల కంచుగల్ బండే మఠం 25 సంవత్సరాల వార్షికోత్సవాలు మఠాధిపతి బసవలింగ స్వామీజీ ఆధ్వర్యంలో చాలా ఘనం నిర్వహించారు. ఈ వార్షికోత్సవాలకు కంచుగల్ బండే మఠానికి చెందిన భక్తులతో పాటు ఇతర జిల్లాల భక్తులు హాజరైనారు.

మఠంలో ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ

మఠంలో ఆత్మహత్య చేసుకున్న స్వామీజీ

కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామీజీ భక్తుల దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు. మఠాధిపతి బసవలింగ స్వామీజీ నిత్యం సమాజసేవ చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించడంతో కంచుగల్ బండే మఠంలోని భక్తులు, సిబ్బంది హడలిపోయారు.

డెత్ నోట్ లో ఏముంది ?

డెత్ నోట్ లో ఏముంది ?


కంచుగల్ బండే మఠంలో మఠాధిపతి బసవలింగ స్వామీజీ బసచేసే గదిలోని కిటికీకి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మఠానికి చెందిన భక్తులు హడలిపోయారు. బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు. బసవలింగ స్వామీజీ డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల కాలంలో కర్ణాటకలో కొంత మంది మఠాధిపతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+