Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకరిద్దరు ప్రధాన మంత్రులు చనిపోతారు, యుద్దాలు, రోగాలు, స్వామీజీ సంచలనం, గతంలో జరిగింది !

2023లో భయంకరమైన కరువు, వరదలు రెండింటినీ చవిచూసిన భారతదేశానికి 2024లో ప్రకృతి వైపరీత్యాలు తప్పవని కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వామిజీ, కోడిమఠానికి చెందిన డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ జోస్యం చెప్పారు. 2024లో రోజులు బాగుండవని స్వామీజీ అన్నారు. డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మీడియాతో 2024లో అకాల వర్షాలు, బాంబు పేలుళ్లు, యుద్ధం జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజం కావడంతో ఆయన జోస్యం మీద ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతారని, భూకంపాలు, వరదలు కూడా వస్తాయని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ అంచనా వేస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఒకరిద్దరు ప్రధానులు చనిపోతారని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Swamiji prophesies that one or two Prime Ministers will die in 2024 and there will be wars,

ఈ ఏడాది పెద్ద ప్రమాదాలు జరుగుతాయని, అకాల వర్షాలు కురవడం వల్ల పెద్దఎత్తున సమస్యలు వచ్చి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, బాంబు పేలుళ్లలో వందలాది మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ చెబుతున్నారు. మతపరమైన సమస్యల కారణంగా ప్రజలు మరింత నష్టపోతారని, ప్రపంచంలోని ప్రభావవంతమైన వ్యక్తులు చనిపోతారని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ జోస్యం చెప్పారు.

మళ్లీ కొన్ని వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, పెను సునామీ వచ్చే అవకాశం ఉందని, వీటన్నింటి నుంచి ప్రజలను కాపాడే శక్తి భగవంతుడికి ఉందని, మనం దేవుడిని ప్రార్థించుకోవాలని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ అన్నారు. అయోధ్య రామమందిరం గురించి కూడా డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మాట్లాడారు. అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన రామాలయం గురించి కోడిమఠం డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మాట్లాడుతూ భారతీయుల్లో ఆధ్యాత్మిక చింతన రోజురోజుకు పెరగడం శుభపరిణామం అన్నారు.

రామజన్మభూమిలో దేవాలయం నిర్మించడం శుభపరిణామమని, రాజకీయాలకు మతం అట్టగట్టడం అంత మంచిది కాదని అన్నారు. ఉగాది తర్వాత దేశ, కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై అంచనాలు చెబుతానని, ఉగాదికి ముందు అంచనాలు వేయడం సరికాదని డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ మీడియాకు చెప్పారు. గతంలో కూడా దేశ రాజకీయాలు, కర్ణాటక రాజకీయాలు, దేశంలో జరగబోయే పరిస్థితుల గురించి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ చెప్పిన జోస్యం ఎక్కువ శాతం నిజం కావడంతో ఆయన జోస్యం మీద కర్ణాటక ప్రజలకు, దేశంలోని కొందరికి ఎక్కువ నమ్మకం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+