గౌతమ్ అదానికి బిగ్ షాక్: డిఫెన్స్ నుంచి అవుట్- కాంట్రాక్ట్ రెన్యూవల్ కు నో..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కీలక నిర్ణయం వెలువడింది. అదానితో ఒప్పందాలను పునరుద్ధరించుకోవడానికి స్వీడన్ డిఫెన్స్ సంస్థ నిరాకరించింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభల రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. దర్యాప్తు జరిపించడానికి అధికార పార్టీ ససేమిరా అంటోంది. ఎదురుదాడికి దిగుతోంది.
హిండన్ బర్గ్ నివేదిక వెలుగు చూసిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. రాజకీయంగా దుమారం రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. అదానీతో రక్షణ పరికరాలు, ఫైటర్ జెట్ల తయారీ కోసం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను పొడిగించకూడదని నిర్ణయించినట్లు స్వీడన్ కు చెందిన డిఫెన్స్ కంపెనీ సాబ్ తెలిపింది. అదాని- సాబ్ కంపెనీల యాజమాన్యం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

దేశ వైమానికి దళానికి గ్రిపెన్- ఈ రకానికి చెందిన యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇది. 114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ లను తయారు చేయడానికి అదాని-సాబ్ మధ్య గతంలో ఈ ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఈ 114 గ్రిపెన్-ఈ రకం ఫైటర్ జెట్లను తయారు చేయాల్సి ఉంది. దీని టెండర్ కోసం పోటీ పడుతున్న సంస్థల్లో స్వీడన్ కు చెందిన ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ.. సాబ్.
అదాని-సాబ్ మధ్య 2017లో ఈ ఒప్పందం కుదిరింది. 2019లో దీని గడువు ముగిసింది. గడువు ముగిసిన తరువాత కాంట్రాక్ట్ ను పునరుద్ధరించుకోవడానికి రెండు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో హిండన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్ట్ రెన్యూవల్ కు పుల్ స్టాప్ పడింది.
పరస్పర అంగీకారంతోనే తాము అదాని నుంచి విడిపోతున్నట్లు సాబ్ కంపెనీ భారత విభాగాధిపతి మాట్స్ పామ్బెర్గ్ తెలిపారు. 2019లో గడువు ముగిసిన ఎంఓయూను పునరుద్ధరించకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇదివరకే సాబ్ కు అందజేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ కు బ్రేక్ పడినట్టయింది. గ్రిపెన్ ఫైటర్ జెట్లను సాబ్ కంపెనీ తయారు చేస్తోంది. మిగ్-21 కంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వీటి సొంతం.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications