తమిళ హీరో,డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి; పీఎం మోడీ, స్టాలిన్, ఖుష్బూ సంతాపం!!
తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్ కాంత్ మృతిపై తమిళ చిత్ర పరిశ్రమతో పాటు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయ్ కాంత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ మరణం చాలా బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారు అని ప్రధాన నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo
— Narendra Modi (@narendramodi) December 28, 2023
డిఎండికె వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. మా ప్రియ మిత్రుడు నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయ్ కాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతి తో పాటు ఎంతో బాధను కలిగించిందని స్టాలిన్ పేర్కొన్నారు.
அன்பிற்கினிய நண்பர் - தேசிய முற்போக்கு திராவிடக் கழக நிறுவனத் தலைவர் கேப்டன் விஜயகாந்த் அவர்களுக்கு இறுதி மரியாதை செலுத்தினேன்.
— M.K.Stalin (@mkstalin) December 28, 2023
நல்ல உள்ளத்திற்குச் சொந்தக்காரரான நண்பர் விஜயகாந்த் அவர்கள் திரையுலகிலும் பொதுவாழ்விலும் தனது கடும் உழைப்பினால் வெற்றிகரமான முத்திரைகளைப் பதித்த… pic.twitter.com/09qWav7Pnk
మంచి మనసున్న మిత్రుడు విజయ్ కాంత్ సినీ పరిశ్రమలోనూ ప్రజా జీవితంలోనూ తన కఠోరమైన శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజలపక్షాన నిలబడ్డారని స్టాలిన్ కొనియాడారు. నటుడుగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా ఏ పని చేపట్టిన దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించారు అన్నారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడని స్టాలిన్ విజయకాంత్ గొప్పతనాన్ని స్మరించుకున్నారు.
విజయ్ కాంత్ మృతి పట్ల నటి ఖుష్బూ సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కాంత్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్న ఆమె ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు తీర్చలేనిదని ఖుష్బూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా తమిళనాడు ప్రభుత్వం విజయ్ కాంత్ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. నేడు సంతాప దినంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో సినిమా షో లను రద్దు చేసింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications