అమ్మకు కోపం: కొడుకు పెళ్లితో పదవి పీకేశారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు కోపం వస్తే వారి పదవులు ఇట్టే ఊడిపోతాయి. వారు ఎంతటి ప్రభావం ఉన్న నాయకులైనా సరే అమ్మ మాట కాదని వెళితే చుక్కలు కనపడతాయి.
కుమారుడి పెళ్లికి ప్రత్యర్ధి వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వచ్చాడని తెలుసుకున్న జయలలిత ఆయనగారి పదవి పీకేశారు. ఏఐఏడీఎంకే తిరునల్వేలి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నారాయణ పని చేస్తున్నారు.
ఆయన ఆ జిల్లాలో బలమైన నాయకుడు. ఇటీవల తన కుమారుడి పెళ్లి జరిపించిన నారాయణ పలువురు సొంత పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెళ్లి రంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖులు పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశిర్వధించారు.

ఈ శుభకార్యానికి పారిశ్రామికవేత్త వైకుంఠ రాజన్ హాజరైనారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు పెళ్లికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. విషయం తెలుసుకున్న జయలలిత నారాయణను పదవి నుంచి తప్పించారు.
ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్పా అమ్మ మీద తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు సన్నిహితంగా ఉన్న వారిని, పారిశ్రామికవేత్తల మీద అమ్మ దృష్టి పెట్టారు. శశికళ పుష్పతో తూత్తుకుడి జిల్లాకు చెందిన వైకుంఠ రాజన్ సన్నిహితంగా ఉంటారని సమాచారం.
తనకు నచ్చని వారిని, పార్టీకి పనికిరాని పారిశ్రామికవేత్తలను, ఇతర పార్టీల నాయకులను శుభకార్యాలకు పిలిస్తే ఫలితం ఇలా ఉంటుందని జయలలిత మరోసారి నిరూపించారు. మొత్తం మీద కొడుకు పెళ్లి పుణ్యమా అంటూ నారాయణ పదవి ఊడిపోయింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications