జయ కుళ్లు రాజకీయాలు: వచ్చే వారంలో సుప్రీంకు
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసును వచ్చే వారంలో సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర అన్నారు. మంగళవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.
జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో పలు జాగ్రతలు తీసుకుంటున్నామని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టులో ఈ కేసును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య వాదిస్తారని చెప్పారు.
ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది హరీష్ ను సలహాదారుడిగా నియమించామని వివరించారు. న్యాయవాదుల టీం పరిశీలకుడిగా ప్రముఖ న్యాయవాది సందేష్ ను నియమించామని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండ సుప్రీం కోర్టులో పక్కా ఆదారాలతో సాక్షాదాలు సమర్పిస్తున్నామని మంత్రి జయచంద్ర చెప్పారు.

రాజకీయ కక్షలు!
తమిళనాడు ప్రభుత్వం ద్వేషరాజకీయాలు చేస్తున్నదని మంత్రి టీబీ జయచంద్ర ఆరోపించారు. కావేరి నీటి వివాదం ఎంతో కాలం నుండి జరుగుతున్నదని గుర్తు చేశారు. జయలలిత కేసును సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని తాము ప్రకటించిన తరువాత తమిళనాడు ప్రభుత్వం కుళ్లు రాజకీయాలు చేస్తున్నది ఆరోపించారు.
కావేరి నీటిలో కలుషిత నీరు కలిపి తమిళనాడుకు వదిలి పెడుతున్నామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తమిళనాడు ప్రభుత్వానికి న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర హితవు పలికారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications