రాష్ట్రపతితో గవర్నర్ విద్యాసార్ రావ్ భేటీ: 18 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల విషయం !

తమిళనాడు రసవత్తర రాజకీయాలుఢిల్లీలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ బిజీరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ, 18 మంది ఎమ్మెల్యేల విషయంలో ?

న్యూఢిల్లీ: తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ న్యూఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి తమిళనాడు రాజకీయాలపై చర్చించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు.

తమిళనాడు రాజకీయాల విషయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ముఖ్యంగా చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రపతి సూచనలు సలహాలు తీసుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది.

Tamil Nadu Governor going to meet President of India on today

తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు లేదని, శాసన సభలో సీఎం బలపరీక్ష నిర్వహించి మెజరిటీ నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదే సమయంలో టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఢిల్లీలోనే తమిళనాడు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై వెళ్లాలని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+