శశికళ ఫ్యామిలీని ఛీకొట్టిన జయలలిత: ఆ సీడీలు మళ్లీ విడుదల, పళని, పన్నీర్ ప్లాన్ !
శశికళను గతంలో విమర్శించిన అమ్మ జయలలిత, ఇప్పుడు మరో సారి ప్రజల్లోకి నేడు వీడియో టేపులు ఉన్న సీడీలు విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం మేమే కాదు గతంలో అమ్మ మన్నార్ గుడిని ఛీకొట్టారు, అన్నాడీఎంకే ప్రభ
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెబల్ రాజకీయాల్లోకి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దించారు. అన్నాడీఎంకే పార్టీలో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పెత్తనాన్ని మేమే కాదు గతంలో అమ్మ జయలలిత కూడా వ్యతిరేకించారని ప్రజల్లో ప్రచారం చెయ్యాలని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం నిర్ణయించింది.
శశికళ, ఆమె కుటుంబ సభ్యలను విమర్శిస్తూ గతంలో జయలలిత చేసిన విమర్శలు ఉన్న వీడియోలను సీడీల రూపంలో తయారు చేసిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యింది. జయలలిత శశికళ, ఆమె కుటుంబ సభ్యులను జయలలిత బహిరంగంగా విమర్శించిన వీడియోలు ఉన్న రెండు సీడీలను తమిళనాడు మంత్రి ఆర్ బీ. ఉదయ్ కుమార్ మీడియా ముందు విడుదల చేశారు.

అమ్మ స్వయంగా ఛీకొట్టారు
జయలలిత స్వయంగా శశికళ, టీటీవీ దినకరన్, దివాకరన్ తదితరులను వ్యతిరేకించారని, ఇప్పుడు మేము కొత్తగా వ్యతిరేకించడం లేదని మంత్రి ఉదయ్ కుమార్ అంటున్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను జయలలిత తీవ్రస్థాయిలో విమర్శించారని, ఛీకొట్టి బయటకు గెంటేశారని మంత్రి ఉదయ్ కుమార్ గుర్తు చేశారు.

రెండు సీడీలు
2011 డిసెంబర్ 30వ తేదీన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళ కుటుంబ సభ్యుల మీద జయలలిత చేసిన వ్యాఖ్యలు ఒక సీడీలో ఉన్నాయని మంత్రి ఉదయ్ కుమార్ చెప్పారు. 2013 నవంబర్ 10వ తేదీన ఎడప్పాడి పళనిసామి కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో జయలలిత మరో సారి శశికళ కుటుంబ సభ్యులను విమర్శిస్తూ చేసిన ప్రసంగం మరో సీడీలో ఉందని మంత్రి ఉదయ్ కుమార్ అన్నారు.

పదవుల కోసం చస్తున్నారు
జయలలిత బహిష్కరించిన వారందరూ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకుని పదవులు పంచుకోవడానికి పోటీ పడుతున్నారని మంత్రి ఉదయ్ కుమార్ విమర్శించారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అందర్నీ పార్టీకి దూరం చెయ్యడానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని మంత్రి ఉదయ్ కుమార్ మనవి చేశారు.

మాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు
పార్టీని, ముఖ్యంమంత్రి పదవిని తమ నుంచి ఎడప్పాడి పళనిసామి హైజాక్ చేశారని టీటీవీ దినకరన్ రగిలిపోతున్నారు. తమకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనే ఉద్దేశంతో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి టీటీవీ దినకరన్ తెర వెనుక ప్రతిపక్షాలతో కలిసి పని చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.

ప్రజలే శశికళను ఛీకొట్టాలని ప్లాన్
శశికళ, ఆమె కుటుంబ సభ్యులను ప్రజల్లో అప్రతిష్టపాలు చెయ్యాలని ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను స్వయంగా అమ్మ జయలలిత ఎంతో వ్యతిరేకించారో మరో సారి గుర్తు చెయ్యడానికి ఇప్పుడు సీడీలను తెరమీదకు తీసుకు వచ్చారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications