సిట్టింగ్ ఎంపీ ప్రాణం తీసిన టిక్కెట్, మరోసారి ఎంపీ కావాలనే ఆశతో, నిద్రమాత్రలతో బెదిరించి ?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన తమిళనాడు ఎండీఎంకే సీనియర్ నేత, ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి కన్నుమూశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న ఎంపీ గణేష్ మూర్తి గురువారం వేకువ జామున తుది శ్వాస విడిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
గణేష్ మూర్తి ఎండీఎంకే పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు. 2019 లోక్సభ ఎన్నికలలో ఈరోడ్ నుండి డీఎంకే కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని గణేష్ మూర్తి అనుకున్నారు. గణేష్ మూర్తి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని, తనకు సీటు ఇవ్వాలని ఇంతకాలం ఆశపడ్డారు.

అయితే ఈసారి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎండీఎంకే స్వతంత్రంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. టికెట్ రాలేదన్న కారణంతో మార్చి 24వ తేదీన గణేష్ మూర్తి నిద్రమాత్రలు సేవించి ఆత్మహత్యకు యత్నించాడని సమాచారం. విషయం గుర్తించిన మూర్తిని కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స కొనసాగించారు.
#UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2
— ANI (@ANI) March 28, 2024
అయితే దురదృష్టవశాత్తు గురువారం వేకువ జామున సుమారు 5 గంటల సమయంలో ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. నిద్రమాత్రలు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ గణేష్ మూర్తికి చికిత్స అందిస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన చికిత్స విఫలమై చనిపోయారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చెయ్యాలని ఆశతో పార్టీ నాయకులను బెదిరించాలని నిద్రమాతలు మింగిన గణేష్ మూర్తి చికిత్స విఫలమై చనిపోవడంతో ఎండీఎంకే పార్టీలో విషాదచాయలు నెలకొన్నాయి.
సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి లోక్ సభ ఎన్నికల టిక్కెట్ కోసం ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడులోని రాజకీయ నాయకులు హడలిపోయారు. తమిళనాడులోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా గణేష్ మూర్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications